27, అక్టోబర్ 2016, గురువారం
6, అక్టోబర్ 2016, గురువారం
మిత్రులారా! నేటి(6.10.2016) "నేటి నిజం " పత్రిక లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సంకలనం చేసిన "మా అన్నయ్య" పుస్తకం పై సమీక్ష ప్రచురింపబడింది.అందులో "మా అన్నయ్య బంగారు కొండ" అనే శీర్షికతో నేను రాసిన కవిత ను బాగుందంటూ సమీక్షకులు ప్రశంసించడం నాకు ఉత్సాహాన్ని కలిగించింది. ఆ కవిత, ఆ సమీక్ష మీ కోసం..నా ఆనందంలో పాలు పంచుకుంటారని భావిస్తూ..ఉగాదినాడు ఆ కవితకు కవిసత్కారం చేయడమే కాక 36 మంది కవితల్నీ పుస్తకంగా వెలువరించిన పెద్దలు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి వందనాలతో..సమీక్షను పంపిన చలపాక ప్రకాష్ గారికి ధన్యవాదాలతో..
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.,
పుస్తక సమీక్ష.
4, అక్టోబర్ 2016, మంగళవారం
got 3rd prize in children story competetion.
మిత్రులారా! శుభోదయం..రేపటికోసం మాసపత్రిక వారి కథలపోటీలో బాలల కథల విభాగంలో నా కథ "చదువు రుచి" తృతీయ బహుమతి గెలుచుకుంది.రేపటికోసం తొలివార్షికోత్సవ సందర్భంగా అనేక విభాగాలలో జరిగిన ఈ పోటీలకు స్పందన ఆశించిన దానికన్నా చాలా అధికంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.విజేతలకు డిశెంబర్ లో మంగళగిరిలో జరిగే వార్షికోత్సవ వేడుకలలో బహుమతిప్రదానం జరుగుతుందని,వచ్చే సంచికనుండి బహుమతి పొందిన రచనల ప్రచురణ ప్రారంభం అవుతుందని తెలిపారు.
లేబుళ్లు:
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)