15, జూన్ 2017, గురువారం

ఉపన్యసించడం,

మిత్రులారా! నిన్న (11.6.2017) సాయంత్రం గుడివాడ షా గులాబ్ చంద్ గ్రంథాలయంలో భారతీ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత,ప్రముఖ నగిషీ చిత్రకారుడు శ్రీ దర్శి జ్వాలాచారి గారి అభినందన సత్కార సభలో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
రాష్ట్ర కవి శ్రీ శంకరంబాడి సుందరాచారి జీవన రేఖలను,సాహితీ ప్రస్థానాన్ని సాకల్యంగా వివరించే భాగ్యం పొందాను.అభిమానంతో తన పుస్తకాలను ఇచ్చి ఆశీర్వదించిన శ్రీ Vasudha B Rao గారికి విశ్రాంత డైట్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం.వి.జి.ఆంజనేయులు,కృష్ణా తరంగాలు మాసపత్రిక సహ ఉపసంపాదకులు శ్రీ రాఘవాచారి గారు ముఖ పుస్తక మిత్రులు శ్రీ వంశీ,తదితరులను కలవడం ఒక ఆనందమైతే ...పుట్టిల్లు గుడివాడ లో (6వ తరగతి నుండి వివాహం వరకు అక్కడే) ఉపన్యసించడం, నాన్న మిత్రులు రంగా అండ్ కో అధినేత ఆశీర్వదించడం..ఒక గుర్తుండిపోయే మంచి సందర్భం..నిర్వాహకులకు,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు.Image may contain: 4 people, people sitting and indoorImage may contain: 4 people, people standing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి