23, జనవరి 2017, సోమవారం

award on 22.1.2017.

నిన్న(22.1.2017)హైదరాబాద్  జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఆర్ట్స్ శ్రీ గుదిబండి వెంకట రెడ్డి గారు తన అమృతోత్సవ వేడుకల్లో భాగంగా జి.వి.ఆర్.ఆత్మీయ సాహితీ పురస్కారాన్ని నాకు ఏలూరు(పశ్చిమ గోదావరి జిల్లా) వై.ఎం.హెచ్.ఏ హాల్ లో అందజేశారు.అక్షరం ఆర్ట్స్(అధ్యక్షులు శ్రీ డి.రాములు) వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
హృదయపూర్వక ధన్యవాదాలు జి.వి.ఆర్.గారికీ,రాములు గారికీ,నిర్వాహకులందరికీ.   

8, జనవరి 2017, ఆదివారం

విజయవాడ పుస్తక మహోత్సవంలో 6.1.2017 న ముఖాముఖి కార్యక్రమంలో నేను పాల్గొని నా సాహితీ పురోగతిని అందరితో పంచుకున్నాను.ఎందరో గొప్ప రచయితల తో ఆ వేదికను పంచుకోవడం నాకు చక్కని అనుభూతిని,స్ఫూర్తిని కలిగించింది.ముఖాముఖి ఉద్దేశ్యం కేవలం రచయితలు వారి బయోడేటాని గడగడ చదువుకుపోవడంగా కాక "వారి సాహితీ ప్రస్థాన ప్రేరణను, వారి రచనల ద్వారా నెరవేర్చదలచిన సామాజిక బాధ్యతను, ఆ మార్గంలో వారికెదురైన మెరుపులను,మరకలను,వాటి ద్వారా వర్ధమాన రచయితలు నేర్వవలసిన పాఠాల్ని పంచుకోవడంగా నాకనిపించింది. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేయడమే కాక సత్కారంతో నన్ను ఆశీర్వదించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు,డా.జి.వి.పూర్ణ చంద్ లకు, నిర్వాహకులందరికీ, నన్ను గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించిన, పరిచయం చేసుకున్న రచయితలందరికీ నమోవాకములు.