31, డిసెంబర్ 2015, గురువారం

2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 3.ఉపన్యాసాలు:"విశ్వనాధ సాహితీ వైభవం" జాతీయ సదస్సు లో పత్ర సమర్పణ .. 1.శంకరంబాడి సుందరాచారి జీవన రేఖలు 2.శంకరంబాడి విరచిత సుందర రామాయణం.. 3.చలం..మ్యూజింగ్స్,బుజ్జిగాడు. 4.చలం..గీతాంజలి. 5.ఒక రోజేమైందంటే.. 6.మహానటి సావిత్రి జీవన రేఖలు. 7.గరికిపాటి వారి అష్టావధానం లో పృచ్చక పరిచయం. ఇంకా........ఆకాశవాణి లో స్మృతిహారతి కవితాపఠనం, 2 సభలలో సభాధ్యక్షత,భావతరంగిణి మాసపత్రికలో బాలతరంగిణి శీర్షిక నిర్వహణ అవకాశం, పలు పోటీ లలో క్విజ్ మాస్టర్,జడ్జి...


2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 2: సమీక్షలు: 1.వడలి రాధాకృష్ణ కథలు.(సభావేదికపై) 2.23ఆగస్ట్..అలనాటి విశేష కవితలు..(ద్వా.నా.శాస్త్రి). 3.17నవంబర్..సత్యసాయి శతకం(మెండు సుబ్బారావు). 4.5.డిశంబర్..ఒంటరి పక్షులు జంటయ్యాయి(డా.ధన్వంతరి ఆచార్య) 5. అక్టోబర్ భావతరంగిణి..మనసుతడి,భూమి ఇంకా గుండ్రంగానే ఉంది. 6.నవంబర్ భావతరంగిణి..పాలగుమ్మి పద్మరాజు.


2015 లో సాహితీ పరంగా నా పురోగతికి కారకులైన ప్రతి ఒక్కరికీ నమస్సులు.. వివరాలు.. 1.కథలు: 1.జనవరి-బాలభారతం.."బంగారు మామిడి". 2.2 జనవరి-ఈనాడు హాయ్ బుజ్జీ.."పెంపుడు కాకి". 3.18 జనవరి-ఈనాడు హాయ్ బుజ్జీ.."కోతి కృతజ్ఞత". 4.6ఫిబ్రవరి- ఈనాడు హాయ్ బుజ్జీ.."ఎగరని కోయిల ఎగిరింది". 5.6ఏప్రిల్-ఈనాడు హాయ్ బుజ్జీ.. కొక్కొరోకో-బుద్దొచ్చిందహో". 6.27జూన్-ఈనాడు హాయ్ బుజ్జీ.."సిం హం తో స్నేహం". 7.19జులై-ఈనాడు హాయ్ బుజ్జీ.."ఉల్లిపకొడీ ఉపకారం". 8.16 అక్టోబర్-ఈనాడు హాయ్ బుజ్జీ.."మిఠాయి కావాలా మిట్టూ". 9.నవంబర్ చెకుముకి.."ఒంటరి ఒంటె". 10.డిశంబర్ బాలభారతం.."గారెలు తిన్న గాడిద".


20, డిసెంబర్ 2015, ఆదివారం

feeling happy..


2010లో తెలుగుభాషాసమాఖ్య మచిలీపట్నం ఆధ్వర్యం లో భాషాక్రీడాకారిణి బిరుదుతో ఉగాది పురస్కారం అందుకున్న తీపి జ్ఞాపకాలు..









ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 600 పజిల్స్ లో ఒక పజిల్....@27/12/2009


25, నవంబర్ 2015, బుధవారం

ఒక మాట...

గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 19న మహిళాదినోత్సవం జరిగింది.ఆ సభకు నేను అధ్యక్షత వహించాను.ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని కె.వై.ఎల్.ఎన్.కళాసాగర్ పక్షాన తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య  నిర్వహణ లో జరిగిన సభ ఇది.

17, నవంబర్ 2015, మంగళవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 21వ పిల్లల కథ"గడ్డిపూవు-మల్లెమొగ్గ".

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 21వ పిల్లల కథ"గడ్డిపూవు-మల్లెమొగ్గ"..16/5/2013 న ప్రచురితం..పెంపకం అంశం తో కథ రాయాలనిపించి రాసిన కథ..

11, నవంబర్ 2015, బుధవారం

...................

మా బడిలో 10వ తరగతి చదివే నాగరాజు అనే పిల్లవాడు నరకచతుర్దశి రోజు (నిన్న) చనిపోయాడు.కామెర్లు తిరగబెట్టాయి..పథ్యం సరిగా చెయ్యలేదు అన్నారు.."తులసితీర్ధం నాటిక వేయించా అతను 8వ తరగతి లో ఉండగా.ముగ్గురే పాత్రధారులు.అద్భుతమైన హాస్యం, నీతి గల నాటిక.దినేష్,ఖాదర్ లు భార్యాభర్తలుగా అద్భుతంగా నటించగా "నాగరాజు" పాలేరు నారాయణ  పాత్రలో అత్యద్భుతంగా నటించాడు..45నిమిషాలకు కుదించిన ఆ నాటిక లో సంభాషణలను అలవోకగా నేర్చుకుని తన ధారణతో నన్ను,నటనతో అందరినీ నివ్వెరబోయేలా చేసిన ఈ బాలుడి జీవిత పాత్ర అప్పుడే ముగింపుకు రావడం నాకు........నారాయణా అనగానే ఏంటండీ అని నవ్వుతూ దగ్గరకు వచ్చే నాగరాజు ..అతడి చిట్టిపొట్టి రూపం..నేను ఎప్పటికీ మరువలేను.    

27, అక్టోబర్ 2015, మంగళవారం

పజిల్ నెం.1.. వాక్యాల్లొ 3 జీవులు

ఒక్కో వాక్యం లో మూడేసి జీవులు దాక్కున్నాయి..కనిపెట్టగలరా??
1. మా మేనత్త ఈ గది లో వాచీ మర్చిపోయింది.
2. మేకప్ తీసేసి కుక్కర్ పెట్టేస్తే ఈ రోజింక పని లేనట్లే.
3. నీతూ! నీ గదిలోనే ఏదో మందమతిలా ఏకాకిగా కూర్చోకు.
4. కిషోర్ గాడి దర్పం, కోపం దినందినం పెరుగుతున్నాయి.
5. ఏది ఏమైనా ఈ ఉల్లిపకోడి వాసనకు ఆవులింతలాగిపోతాయి.
6. తుపాకి పేలుస్తానని ఖాసిం హంగామా చేసింది ఇప్పుడే గదా.
మరికొన్ని వాక్యాలు,జవాబులు రేపు..మీ ఆసక్తిని బట్టి.
నేను రాసిన ఈ పజిల్ ఈనాడు హాయ్ బుజ్జీ లో 28/01/2007 న ప్రచురితం.
ధన్యవాదాలు.

26, అక్టోబర్ 2015, సోమవారం

ఒక మాట

రేపటి నుండి రోజుకో పజిల్..మీ పిల్లల కోసం..శీర్షిక: "వాక్యాల్లో ఏం దాక్కున్నాయ్??" మరి మీరు సిద్దమేనా?
ఉదా: "జింకపిల్ల గంతులు వేస్తోంది."
పై వాక్యం లో జింక కనబడుతూనే ఉంది..దాక్కున్న రెండో జంతువును పట్టుకోండి చూద్దాం.

20, అక్టోబర్ 2015, మంగళవారం

ఒక ఖైదీ రాసిన ఆఖరి లేఖ..ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పజిల్..@03/04/2005.

ఒక ఖైదీ రాసిన ఆఖరి లేఖ..ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 11వ పజిల్..@03/04/2005.ఈ లేఖలో 11 వాహనాలు దాక్కున్నాయి.వాటిని పట్టుకోవాలి.అదీ సంగతి.మరి ప్రయత్నించండి.అన్నట్లు తెలుగు సదస్సు లో డిగ్రీ స్థాయి లో పజిల్స్ పోటీ నిర్వహించారు 2012 లో.(ఈనాడు వారు) అందులో ఈ పజిల్ ఒకటి.ఆ పజిల్స్ పోటీ రూపకల్పన , నిర్వహణ నాకు అప్పగించారు.

11, అక్టోబర్ 2015, ఆదివారం

ఒక మాట..మంచి సందేశాలు విన్నానీ రోజు.

 కొన్ని గంటల క్రితం(10/10/15) కృష్ణాజిల్లా రచయితల సంఘం 2014,2015సంవత్సరాల సాహితీ పురస్కారాల ప్రదానసభ విజయవాడ,హోటల్ ఐలాపురం ఎ.సి.సెమినార్ హాల్ లో కన్నుల పండువగా జరిగింది.
వేదిక పై ఉన్న మహామహులను చూడటానికి ఒళ్ళంతా కళ్ళై,వారు మాట్లాడుతుంటే ఒళ్ళంతా చెవులై..ఆ మాటల్లో కొన్ని ఆణిముత్యాలు మీతో పంచుకొన మనసై..
"వ్యక్తి కి బహువచనం శక్తి"అంటూ నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఆలోచనలు రేకెత్తించిన శ్రీ గొల్లపూడి మారుతీ రావు,
దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది అంటాం గానీ ఇండిపెండెంట్ వచ్చింది అనం కదా..అలా..దేశానికి స్వతంత్రం వచ్చింది అనరాదు ..స్వర్ణకారులు,చిత్రకారులు లాగా మత్స్యకారులు అనరాదు.అంటూ శ్రీ రవ్వా శ్రీహరి..సూర్యరాయాంధ్ర నిఘంటువు లో లేని పదాలు కూర్చి 1000 పేజీల నిఘంటువు వేశారీయన.వీరు గ్రామర్ కే గ్లామర్ అద్దారు వంటి అద్భుతమైన అనుసంధానాలతో సభాధ్యక్షత వహించారు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
 కవిత రాయడమంటే ఇంతకాలం బతికిన బతుకంతా మళ్ళీ ఒకసారి బతకాలనిపించడమంటూ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ..కవిత్వం నా కనురెప్పలపై వాలిన కమ్మని కల..నేలని చీల్చుకుని అంకురం వచ్చినపుడు..తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చినంత సంబరం.అంటూ శ్రీ రాధేయ ఒళ్ళు పులకరింపజేశారు.
"విజయవాడ కో సాహిత్యకిరీటం కృష్ణాజిల్లా రచయితల సంఘం" అంటూ శ్రీ అప్పలనాయుడు అలరిస్తే డి.కామేశ్వరి గారు రచయితల సమస్యలను సున్నితంగా ప్రస్తావించారు.
జ్ఞానం పెట్టుబడి తక్కువ..లోకజ్ఞానం పెట్టుబడి ఎక్కువ ప్రస్తుత కాలంలో అంటూ శ్రీ సి.రాఘవాచారి ఆలోచింపజేస్తే చివరగా శ్రీ వీరాజీ గారు "చివరకు మిగిలేది..నేనే" అని నవ్విస్తూ ఆరంభించి.."ఆంధ్రపత్రిక సంపాదకునిగా నా సంపాదన ఇప్పుడు కనబడింది..మీ అభిమానం రూపంలో ..అల ఒడ్డు కు వస్తే కేరింతలతో ఆనందిస్తాం..కనీ అది పడే సంఘర్షణ,సంక్షోభం మనకి తెలీవు."అంటూ హృద్యమైన ప్రసంగంతో మనసు కు తడి చేశారు.
ఆంధ్రపత్రిక శతజయంత్యుత్సవాలను ఈ సంవత్సరం జరుపుకుందాం అని మండలి బుద్దప్రసాద్ గారు ప్రకటించారు.
ఈ అద్భుతమైన సభలో పాల్గొనడమే కాక డా.తుర్లపాటి రాజేస్వరి గారి సన్మానపత్రం చదివే అవకాశం కల్పించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నా ధన్యవాదాలు.
                                 

7, అక్టోబర్ 2015, బుధవారం

ఒక మాట..మీకో సరదా సినిమా పరీక్ష పెట్టనా??

మీకో సరదా సినిమా పరీక్ష..ఇది నా 24వ పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ లో..27/11/2005న ప్రచురితం..జవాబులు కావాలంటే ఆది వారం వరకు ఆగండి.
సినిమా టైటిల్స్ లో చాలా విషయం ఉందండోయ్.
క్రింది ప్రతి ప్రశ్న కి సరిపోయేలా మీరు రెండేసి సినిమా పేర్లు చెప్పాలి..ఆధారనికి సరిపోయే పదం సినిమా పేరులో ఉంటే చాలు.(2 కంటే ఎక్కువ జవాబులు కూడా వస్తాయి)
ఉదా: రుతువులు=వసంతం,వర్షం.

1.దిక్కులు     2.రుతువులు   3.వారాలు     4.నెలలు    5.వాహనాలు
6.సంఖ్యలు    7.సంగీతరాగాలు   8.లోహాలు    9.పక్షులు  10.కీటకాలు
11.జంతువులు  12.వృత్తులు  13.ఆయుధాలు  14.సంగీతవాయిద్యాలు  15.క్రీడలు
16.పువ్వులు  17.రంగులు  18.పండుగలు   19.ముద్దుపేర్లు  20.తిట్లు
21.బంధుత్వాలు  22.నగరాలు  23.దేశాలు  24.మహాభారతం పాత్రలు  25.స్వాతంత్ర్య సమరయోధులు.

30, సెప్టెంబర్ 2015, బుధవారం

ఒక మాట..రేడియో ప్రోగ్రాం కి వెళ్తున్నా ఈ రోజు..

అక్టోబర్ 2 గాంధీజయంతి నాడు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం కానున్న 13మంది కవుల కవితా కదంబ కార్యక్రమాన్ని శ్రీమతి గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రష్టు సౌజన్యంతో కృష్ణాజిల్లారచయితల సంఘం నిర్వహిస్తోంది. పాల్గొంటున్న కవులు:
శ్రీ ఉప్పలూరి లక్ష్మీనారాయణ, శ్రీ యెరుకలపూడి గోపీనాథరావు, డా. గుమ్మా సాంబశివరావు, శ్రీ అవనిగడ్డ సూర్యప్రకాష్, డా. వెన్నా వల్లభరావు, శ్రీ బందా వెంకట రామారావు, శ్రీ సి హెచ్ వి ఎస్ బృందావనరావు, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సుందరి, శ్రీమతి కావూరి సత్యవతి, శ్రీమతి గుడిపూడి రాధికారాణి, శ్రీ చలపాక ప్రకాష్, శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి పాల్గొంటున్నారు. కవులకు అభినందనలు..

28, సెప్టెంబర్ 2015, సోమవారం

మరొక మరిచిపోలేని రోజు..

నిన్న (27/9/2015)కె.వై.ఎల్.ఎన్.జయంత్యుత్సవం లో జరిగిన మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్.గరికిపాటి నరసిం హా రావు గారి అష్టావధానం లో నేను పృచ్చక పరిచయం చేశాను.ఆ మహానుభావుడు నాకు శాలువా కప్పడం,గుత్తికొండ సుబ్బారావు గారు జ్ఞాపిక ను ఇవ్వడం..మరొక మరిచిపోలేని రోజు నా జీవితంలో..దండిభొట్ల దత్తాత్రేయ శర్మ గారికి అబినందనలు,ధన్యవాదాలు.