27, అక్టోబర్ 2015, మంగళవారం

పజిల్ నెం.1.. వాక్యాల్లొ 3 జీవులు

ఒక్కో వాక్యం లో మూడేసి జీవులు దాక్కున్నాయి..కనిపెట్టగలరా??
1. మా మేనత్త ఈ గది లో వాచీ మర్చిపోయింది.
2. మేకప్ తీసేసి కుక్కర్ పెట్టేస్తే ఈ రోజింక పని లేనట్లే.
3. నీతూ! నీ గదిలోనే ఏదో మందమతిలా ఏకాకిగా కూర్చోకు.
4. కిషోర్ గాడి దర్పం, కోపం దినందినం పెరుగుతున్నాయి.
5. ఏది ఏమైనా ఈ ఉల్లిపకోడి వాసనకు ఆవులింతలాగిపోతాయి.
6. తుపాకి పేలుస్తానని ఖాసిం హంగామా చేసింది ఇప్పుడే గదా.
మరికొన్ని వాక్యాలు,జవాబులు రేపు..మీ ఆసక్తిని బట్టి.
నేను రాసిన ఈ పజిల్ ఈనాడు హాయ్ బుజ్జీ లో 28/01/2007 న ప్రచురితం.
ధన్యవాదాలు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి