14, జనవరి 2016, గురువారం

అద్దేపల్లి రామమోహన రావు గారి మరణ వార్త..నిరాశ కు నిర్వచనం నాకు తెలిపింది. 5వ ఏట నుండి చందమామలు చదివించే నాన్న 6వ తరగతిలో తను ఎప్పటినుండో దాచి ఉంచిన ఒక కవితల పుస్తకం(1969 లో ముద్రణ) నాకు ఇచ్చి "ఇన్నాళ్ళూ కిటికీ లోనుండి నువ్వు లోకాన్ని చూశావు..ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల తలుపు తెరుచుకుని వెళతావు."అన్నారు.ఆ పుస్తకం లో గబ్బిట దుర్గాప్రసాద్,స్వర్ణరాజ హనుమంత రావు మొ..ఎందరివో అద్భుతమైన కవితలు ఉన్నాయి. ఎన్ని సార్లు చదివానో..చెప్పలేను బతికుండగా అద్దేపల్లి ని కలవాలని ఆశ పడి నిరాశ మిగిలిన బాధతో.....








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి