24, జులై 2016, ఆదివారం

నా సమీక్ష

ఈరోజు(24/7/2016) రచయిత్రి శ్రీమతి వాడవల్లి విజయ లక్ష్మి గారి స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ వేడుక జరిగింది.ఇండియన్ కల్చరల్ అసోసియేషన్(భవిష్య గారు) నిర్వహణ లో జరిగిన సభకు కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా శ్రీ కొల్లు రవీంద్ర,శ్రీ ఆర్.వి.ఎస్.రాజు గారు, డా.మాదిరాజు రామలింగేశ్వర రావు,శ్రీ సవరం వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. బాలసాహిత్య రచయిత్రి,వ్యాసకర్త,ఆధ్యాత్మిక పుస్తక,కథా,నవలా రచయిత్రి వాడవల్లి గారు "అనంతానంద శిఖరము" అనే ఒక ఆధ్యాత్మిక పుస్తకం రచించియున్నారు.ఆ పుస్తకము పై నా సమీక్ష స్వర్ణోత్సవ సంచికలో చోటు చేసుకుంది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి