30, జులై 2016, శనివారం

సంతోషాన్ని మీతో పంచుకోవాలని....

మిత్రులారా! ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారు త్వరలో ఆవిష్కరించనున్న పుష్కర ప్రత్యేక సంచిక.."కృష్ణా తీరం" లో నా వ్యాసం.."బందరులో బ్రౌన్ భాషా సేవలు" ప్రచురింపబడనున్నది.ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని....
అంతేకాదు మిత్రులారా! ఉగాది తర్వాత మరల నేను దూరదర్శన్ లో పుష్కరాల సందర్భంగా కవిసమ్మేళనం లో పాల్గొన్నాను.సప్తగిరి దూర్ దర్శన్ వారు 20-07-2016 న కృష్ణాపుష్కర వైభవం 2016 పేరుతో డా.జి.వి.పూర్ణచంద్  అధ్యక్షతన ఒక కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రముఖ కవులు ఎడమనుండి శ్రీ యంపి. జానుకవి,డా. జంధ్యాల పరదేశిబాబు, శ్రీ సి హెచ్ వి బృందావనరావు, శ్రీ యలమర్తి రమణయ్య, శ్రీ పింగళి వెంకట కృష్ణారావు, శ్రీమతి గుడిపూడి రాధికారాణి(నేను), డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా.జి.వి.పూర్ణచంద్, శ్రీ శిఖా ఆకాష్, కవి కరీముల్లా , డా. పాపినేని శివశంకర్, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీ అజ్మీర్ వీరభద్రయ్య, డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు, డా. రావి రంగారావు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు
ఎందరో లబ్దప్రతిష్టులమధ్య నాకు స్థానం లభించడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది.నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు,డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నమస్సుమాంజలులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి