17, ఆగస్టు 2015, సోమవారం

నా సాహితీ పురోగతి.

భావ తరంగిణి పత్రిక 17వ వార్షికోత్సవ వేడుకలలో భాగం గా కళాశాలల విద్యార్ధులకు క్విజ్ పోటీ లు ఈ రోజు 2-5.30 జరిగాయి.నేను క్విజ్ మాస్టెర్ గా ప్రశ్నలు అడిగాను.భవిష్య గారు చక్కగా రూపకల్పన చేసిన ఆ కార్యక్రమం లో పాలు పంచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది.11 టీంస్,12 రౌండ్స్,సరైన జవాబు కి 2 మార్క్స్,తప్పు సమాధానానికి -1/2,2 ఫోన్ ఎ ఫ్రెండ్ అవకాశాలు..నాకు చాలా నచ్చింది.పైగా భవిష్య గారు ప్రకటించిన బహుమతులే కాక సిలార్ గారు,గుత్తికొండ సుబ్బారావు గారు కూడా పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు ప్రకటించారు..22వ తేదీన సాయంత్రం జరిగే వార్షికోత్సవ వేడుకలలో బహుమతి ప్రదానం జరుగుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి